సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడలోని కనక దుర్గమ్మ అమ్మవారిని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు.. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎం.పి కి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు…కనకదుర్గమ్మ ను దర్శించుకున్న ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దర్శనం అనంతరం వేదపండితులు ఎం.పి నాగరాజుకు వేదాశీర్వచనాలను అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను, షెసవస్త్రాలను , చిత్రపట్టాన్ని అందచేశారు.. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారిని దర్శించికోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.. అమ్మవారి ఆశిశులు రాష్ట్ర ప్రజల పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునట్లు ఆయన తెలిపారు..