MP Nagesh: ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య : ఎంపీ నగేష్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య : ఎంపీ నగేష్
* బడిబాట కార్యక్రమంలో  ఎంపీ, ఎమ్మెల్యేలు

విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆదిలాబాద్ ఎంపీ న‌గేష్ అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ లో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి ఎంపీ న‌గేష్‌, ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌కు పుస్తకాలు యూనిఫామ్ ల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడి బాట కార్యక్రమంలో పాల్గొనడం, పిల్లలతో కలవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.అనంత‌రం మహాలక్ష్మి వాడ‌ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 9.0 పై శాతం ఉత్తీర్ణత సాధించారని వారికి శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, నాయకులు మహేందర్, ఆదినాథ్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *