సిరాన్యూస్, బజార్హత్నూర్
తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: ఆదిలాబాద్ ఎంపీ గోడo నగేష్
* కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తా
* బజార్హత్నూర్ లో విజయోత్సవ కార్యక్రమం సభ
కేంద్ర నిధులతో బోథ్ నియోజకవర్గంను అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రం లోని తిరుమల ఫంక్షన్ హాల్ లో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం సభలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మండలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అటువంటి నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. మండల బీజేపీ నాయకులు భారీ ఎండలను సైతం లెక్కచేయకుండా తన విజయానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా కలిసి పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అంతే కాకుండా కేంద్ర నిధులతో కనివిని ఎరుగని రీతిలో జిల్లా నీ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, రైల్వే బోర్డు మెంబర్ జివి రమణ, జెడ్పిటిసి ఫోరం అధ్యక్షులు తాటిపల్లి రాజు, సహకార సంఘ చైర్మన్ మేకల వెంకన్న, ఎంపీటీసీలు గజానంద్, మురళీ , బీజేపీ నాయకులు కొత్త శంకర్, నానం రమణ, అల్కే గణేష్, చట్ల ఉత్తం, బొడ్డు బోజారెడ్డి, ఎట్టం రాములు, చట్ల సుఖదేవ్, బత్తిని సుధాకర్ , పెరుగు సంతోష్, చట్ల నంద కుమార్ పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా భారత మాత చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వందేమాతర గీతాలాపన చేసి విజయోత్సవ అభినందన సభను ప్రారంభం చేశారు. ప్రతీ కార్యకర్త స్వచ్చందంగా బీజేపీ గెలుపుకోసం, నగేష్ గెలుపు కోసం 50 రోజులు కృషి చేశారు అని వక్తలు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. విజయోత్సవ సభలో పలువురు మొదటి సారి మండలం కు వచ్చినందున శాలువాలు కప్పి సన్మానం చేశారు.