సిరాన్యూస్, ఆదిలాబాద్
కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిన ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు
* ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీనీ పునః ప్రారంభించాలని వినతి
30 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ లో మూతబడి ఉన్న సీసీఐ కి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీ ని తెరిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే
పాయల్ శంకర్, ఎంపీ నగేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్ డీ కుమార స్వామితో భేటీ అయ్యారు. ఆదిలాబాద్ లో గతం లో మూత పడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షం గా దాదాపు 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు. అంతే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ మూడి ఖనిజం లైమ్ స్టోన్ నిక్సేపాలు విస్తారంగా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి చెప్పారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడానికి సిద్ధం గా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రతినిధుల వినతి పై కేంద్ర మంత్రి కుమార స్వామి అనుకూలంగా స్పందించారు.