సిరాన్యూస్, ఆదిలాబాద్
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ విమర్శలు : ఎంపీ నగేష్
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ నగేష్ మాట్లాడారు. గత నెల 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందని తెలిపారు.ఇటీవల కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్ పై ఆరోపణలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర బడ్జెట్లో 9 అంశాలను ప్రాముఖ్యతగా తీసుకొని యువకులను నైపుణ్యాలను వెలికి తీసి, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నామన్నారు. చాలా దూర దృష్టితో రూ. 48 లక్షల వేల కోట్లు బడ్జెట్ పాస్ కావడం జరిగింది అన్నారు. బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైన మాటలు విమర్శలు చేశారన్నారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేశారని రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని ఆరోపణ చేశారు. మేధావులు, చదువుకున్న వాళ్ళు తెలుసు.. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తుందో వాళ్లు అర్థం చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ , ఆదినాథ్ , ఆకుల ప్రవీణ్, జోగు రవి, విజయ్, ధోని జ్యోతి, దయాకర్, నగేష్ రెడ్డి, మహేష్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.