సిరాన్యూస్, ఆదిలాబాద్
కేంద్ర నిధులపై విస్తృత ప్రచారం కల్పించాలి : ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు నిధులపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు అధికారులకు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ మీటింగ్లో కలెక్టర్ రాజర్షి షా తో కలిసి పాల్గొన్నారు. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వ నిధులు, పనులు, యూసీల వివరాలను తెలుసుకున్నారు. పనులు, అభివృద్ధి పథకాలను ప్రజలకు సక్రమంగా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అనేక నిధులను ఇస్తుందన్నారు. కానీ దాన్ని సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. జిల్లాలోని ఆయా శాఖలకు కేంద్రం నుంచి వచ్చిన ఖర్చు చేసి యూసీలు పంపణీ కారణంగా నిధులు రాలేదన్నారు. అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులతో చేపట్టే పనులపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాకు రావాల్సిన నిధులను వంద శాతం తీసుకువస్తానని, అధికారులు కూడా సక్రమంగా వాటిని ఖర్చు చేసి యూసీలను పంపాలన్నారు. అప్పుడే మరిన్నీ నిధులు వస్తాయన్నారు. ఈసమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.