సిరా న్యూస్,భధ్రాచలం;
కొత్తగూడెం లోని భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ లో జరుగుతున్న నిర్మాణ పనులను ఖమ్మం ఎంపీ రామసహయం రఘురాం రెడ్డి పరిశీలించారు. పనులలో నాణ్యత పాటించాలని పలు సూచనలు చేశారు. ఈసందర్భంగాలోకో పైలట్ లు మరికొందరు ఇచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ…. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది అన్నారు. కొత్తగూడెం లో ఉన్నస్టేషన్ నుండి గతంలో నడిచిన అన్ని రకాల రైళ్లను మళ్ళీ పునరుద్ధరించేలా సంబంధిత మంత్రితో మాట్లాడతానని అన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి కొరకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషిచేస్తానని అన్నారు.
===