టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందచేసిన ఎంపి సుబ్బారెడ్డి

సిరా న్యూస్,గోపాలపట్నం;
పద్మనాభనగర్ లో 56 కోట్ల రూపాయలతో నిర్మించిన 810 టి డ్కో ఇళ్లను రాజ్యసభ సభ్యులు వై. వి. సుబ్బారెడ్డి, ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసారు.
సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతప్రభుత్వం ఇదే టి డ్కొ ఇళ్ల కోసం లబ్ది దారులనుంచి లక్షలాది రూపాయలు దండి వారికి ఇవ్వకుండా చేశారు.. కానీ నేడు వై. సి. పి. ప్రభుత్వం వచ్చాక, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగున్నరేళ్ల నుండి పేద ప్రజలకు లక్షలాది ఇళ్లను అన్ని సౌకర్యాలతో ఉచితంగానే అందివ్వడం జరిగిందని సుబ్బారెడ్డి అన్నారు. లబ్ధిదారులకు ఈరోజు ఇళ్లను రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి, అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *