సిరా న్యూస్, కందుర్పి:
మహిళల అభ్యున్నతికి పెద్ద పీట…
మహిళ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, అనంతరపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గం, బ్రహ్మసముద్రం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైఎస్సార్ నాల్గవ విడత ఆసరా చెక్కుల పంపిణీ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని స్వయం సహాయక సంఘాలకు మెగా చెక్కును అందించారు. మహిళలు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరిటనే అమలు చేస్తోందని అన్నారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఇంటి పట్టాల పంపిణీ… ఇలా అన్ని పథకాలకు మహిళలే మూలమని అన్నారు. అర్హులైన వారంత ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.