సిరా న్యూస్,పాణ్యం;
ప్రముఖ శైవ క్షేత్రం లక్షలాదిమంది భక్తులు సందర్శించే పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామం లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమును నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, మంత్రాలయం శాసనసభ సభ్యుడు బాలనాగిరెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా ఆదివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎం. రామకృష్ణ, ప్రధాన అర్చకులు కె. నారాయణస్వామి, వీరయ్యస్వామి, సురేష్ శర్మలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి అభిషేకము, అర్చనలు, విశేష పూజలు, నిర్వహించారు అనంతరం ఆశీర్వాద మండపము నందు, ఎం.పీ, ఎమ్మెల్యేలకు శాలువాలు పూలమాలలతో, విశేష వస్త్రాలతో, ఘనంగా సన్మానించి, పంచామృతం తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.