సిరా న్యూస్,నర్సాపురం;
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ అయ్యారు. నెల మూడో తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనుమూరు వెళ్లారు. ఉదయం బయటికి వెళ్లిన ఆయన మంగళవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ కూడా కాల్ డైవర్షన్ లో ఉంది .దీంతో ఆయన ఆచూకీ పెద్ద సస్పెన్స్ గా మారింది.అయితే ఎంపీడీవో మానసిక ఒత్తిడికి వైసిపి నాయకులే కారణంమన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నర్సాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్ కు కట్టాల్సి ఉంది ..రేవు బకాయి చెల్లించాలని గత కొంతకాలంగా ఎంపీడీవో ఒత్తిడి చేస్తున్న పాట దారుడు దాటవేస్తూ వచ్చాడు . ఆయనకు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో డబ్బులు చెల్లించకుండా మొoడి కేసాడు .
దీంతో మానసిక ఒత్తిడి గురైన సెలవు పై స్వగ్రామం పెనమలూరు వెళ్లారు. వచ్చే ఏడాది మార్చిలో ఆయన పదవి విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో 50 లక్షలు బకాయి ఉండటంతో ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందోనని కొన్ని రోజుల నుంచి ఆందోళనకు గురవుతూ వచ్చారు.