సిరాన్యూస్, బోథ్
నూతన ఎంపీడీవో జీవన్ రెడ్డి సన్మానించిన మాజీ ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల అధికారిగా జీవన్ రెడ్డి ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన మాజీ ప్రజా ప్రతినిధులు సోమవారం సన్మానించారు. అంతేగాక బీజేపీ మండల పార్టీ కన్వీనర్ బి రవీందర్ ఆధ్వర్యంలో సన్మానించారు. నూతనంగా విధుల్లో చేరిన ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.