MPDO Laxman: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో లక్ష్మణ్

సిరా న్యూస్,ఇచ్చోడ‌
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో లక్ష్మణ్
* కామగిరిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో లక్ష్మణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో లక్ష్మణ్ ఫ్రైడేడ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మణ్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైన వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన వస్తువులలో ఎక్కువ రోజుల నుండి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను రహదారి పైన వేయకుండా ఇంటి ముందుకు వచ్చే చెత్త రిక్షాలో వేయాలని ప్రజలను కోరారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అభేదా బేగం, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్ర సహాయకుడు నిమ్మల సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *