సిరా న్యూస్,బోథ్
నూతన ఎంపీడీఓకు గురుకుల మిత్రులు సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బోథ్ ఎంపీడీఓ నూతనంగా వచ్చినా యల్.రమేష్ ను తన మిత్రులు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బోథ్ గురుకుల విద్యార్థులు తమ గురువు అయినా బోథ్ గురుకుల వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఆధ్వర్యంలో బోథ్ గురుకుల విద్యార్థులందరూకలిసి ఎంపీడీవోకు సన్మానం చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయి లో ఉండటం నాకు చాలా గొప్ప గా ఉంది అని అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ గురుకుల మిత్రులు అందరూ పాల్గొన్నారు.