సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎంపీడీవో రవీంద్రనాథ్ కు ఘన సన్మానం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన ఏ రవీంద్రనాథ్ ను మండల పరిషత్ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బుధవారం ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన రవీంద్రనాథ్ కు సిబ్బంది ఈ మేరకు అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి సన్మానించారు. ఎంపీడీవో ను సన్మానించిన వారిలో మండల పంచాయితీ అధికారి ఎస్. దిలీప్, మండల పరిషత్ సూపరింటెండెంట్ జి. ముత్యం రావు, ఈజీఎస్ ఇంచార్జ్ ఏపీవో వెంకటరమణ, మండల పరిషత్ సిబ్బంది తిరుమల్, అజయ్, తదితరులు ఉన్నారు.