Mpdo Ravindranath: ఖాప్రి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అధికారులు

సిరా న్యూస్ జైనథ్:

ఖాప్రి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో రవీంద్ర నాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొని ఉన్న పలు సమస్యల గురించి ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్య, తరగతి గదుల కొరత, తదితర అంశాలను గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఏల్మ సుజాత, ఏఈ ప్రభాకర్, ఏపిఎం భగవాన్లు, వివో ఏ రామన్న, నాయకులు ఎల్టి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *