సిరా న్యూస్, భీమదేవరపల్లి:
భీమదేవరపల్లి ఎంపీడీవో భాస్కర్ బదిలీ…
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ఎంపీడీవో ఎల్ భాస్కర్ను భూపాలపల్లి జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ను పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బదిలీ చేసారు. దీంతో భీమదేవరపల్లి ఎంపీడీవో స్థానం ప్రస్తుతానికి ఖాలీగా మారింది. ఇప్పటివరకు మండలానికి ఎంపీడీవోను కేటాయించకపోవడంతో, ఎంపీడీవోగా ఎవరూ వస్తారో అని సర్వత్రా ఉత్కఠంత నెలకొంది.