MPDO Veeresham: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎంపీడీవో వీరేశం

సిరాన్యూస్, భీమదేవరపల్లి
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎంపీడీవో వీరేశం
* అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎంపీడీవో వీరేశం తెలిపారు.శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా భీమదేవరపల్లి మండలంలోని వంగర,గట్ల నర్సింగాపూర్,గ్రామాలలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు,గ్రామస్తులతో యోగాసనాలు సాధన చేయించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో వీరేశం మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక,ఆధ్యాత్మిక,ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరు ప్రపంచ యోగ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.యోగా అంటే కేవలం శారీరిక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, వంగర కార్యదర్శి మధు, మాజీ సర్పంచ్ కండె రమేష్, మండల అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, విక్రమ్,ఫీల్డ్ అసిస్టెంట్ రజిత గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *