సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలి: మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్
* కాల్వ శ్రీరాంపూర్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడారు. కొద్ది మంది రైతులకే రెండు లక్షల రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ జరగని రైతులు తీవ్రంగా బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రామాల వారీగా ప్రత్యేక సదస్సులను నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించి రుణమాఫీ చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ ఎంఆర్వో శంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొట్టె రవి, మాజీ ఎంపీటీసీ మదాసి చందు, నారెడ్ల సదానందం, రైతులు పాల్గొన్నారు.