సిరాన్యూస్, బోథ్
చదువుతో జీవితానికి వెలుగు రేఖలు: ఎంపీపీ శ్రీనివాస్
విద్య జీవితంలో వెలుగు రేఖలు నింపుతుందని ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ బోథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పరంగా మంజూరు అయిన పాఠ్యపుస్తకాలను డ్రెస్సులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువు లేకుంటే జీవితమంతా అంధకారమనేది గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను అధికారులతో చర్చించి చర్య తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, మహేందర్ రెడ్డి ,జేపీఎం మాధవ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ,అల్లకొండ ప్రశాంత్ ,పాఠశాల ఉపాధ్యాయులు పోశెట్టి ,నారాయణ తదితరులు పాల్గొన్నా