బోథ్, సిరాన్యూస్
డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎంపీపీ
మారుమూల గ్రామాల డెవలప్ మెంట్ కోసం కట్టుబడి ఉన్నామని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో రూ. 4.28 లక్షల నిధులతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పూలన్ బాబా మందిరం నిర్మాణానికి రూ. 1 లక్ష భక్తులకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ, ఎంపీడీవో సుశీల్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ జుగాది రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.