సిరా న్యూస్, చిగురుమామిడి:
సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం
– ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శనం చేసి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే గురువుకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం చిగురుమామిడి జడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోమ లింగా రెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దోమ లింగారెడ్డి శకుంతల దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ… గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దాడని కొనియాడారు. లింగారెడ్డి స్వగ్రామమైన చిగురుమామిడి లో పదవీ విరమణ పొందడం సంతోషకరమని అన్నారు. గత ప్రభుత్వం మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలపేతానికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు. లింగారెడ్డి దంపతులు తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గీకురు రవీందర్, ఎమ్ఈఓ శ్రీనివాస్ రెడ్డి, పీ అర్ టి యు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు బాల్ రెడ్డి, సిఆర్పి అంజనేయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.