MRPS:ఎస్సి వర్గీకరణలో కృషి చేయాలి

సిరా న్యూస్,భీమదేవరపల్లి
ఎస్సి వర్గీకరణలో కృషి చేయాలి
* మండ‌ల క‌మిటీ నాయ‌కులు
* ఎంఆర్‌పీఎస్ ఎంఎస్‌పీ పార్టీల మండల నూతన కమిటీల ఎన్నిక
ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి లో పోరాటంలో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండలం నూతన కమిటీ మంగ‌ళ‌వారం ఎన్నికోవడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షులుగా నక్క సునీల్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కనకం రాజ్ కుమార్ మాదిగ, అధికార ప్రతినిధి మిట్టపల్లి రమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి దిలీప్ మాదిగ, కార్యదర్శులు గజ్జల అనిల్ కుమార్ మాదిగ, కదిరే కిరణ్ మాదిగ, ఎలుకపల్లి సాంబరాజు మాదిగ ఎన్నికైనట్లు తెలిపారు.. ఈ సందర్బంగా మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కమిటీని కూడా ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నికోవడం జరిగింది.. మండల అధ్యక్షులుగా పార్నదుల సురేష్, ఉపాధ్యక్షులు కాదాసు ప్రవీణ్ మాదిగ, మాడ్గుల ప్రభు దాస్ మాదిగ, జిల్లా సహాయ కార్యదర్శిగా నాగిళ్ళ చందర్ మాదిగ, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణలో కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *