సిరాన్యూస్, బోథ్
ముదిరాజులను బీసీఏలో చేర్చాలి : ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు జంగాల భోజన్న
* డీప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేత
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 17 యధావిధిగా అమలు చేయాలని, అంతేగాక ముదిరాజులను బీసీఏ లో చేర్చాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు జంగాల భోజన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ డిప్యూటీ తహసీల్దార్ భూమేష్ కు వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, అందుకుగాను రాజకీయంగా కార్పొరేషన్ పదవులతోపాటు రాజ్యసభ లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ముదిరాజుల నిర్లక్ష్యం చేస్తే సమీప భవిష్యత్తులో ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాయుడు శ్రీనివాస్, కోశాధికారి మహిపాల్, మండల మాజీ అధ్యక్షులు సున్నపు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు నిండు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.