mudupu Nalini Reddy: మ‌హిళ‌ల హ‌క్కుల కోసం ఉద్య‌మాలు చేయాలి: ముడుపు న‌ళిని రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
మ‌హిళ‌ల హ‌క్కుల కోసం ఉద్య‌మాలు చేయాలి: ముడుపు న‌ళిని రెడ్డి
* ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ సంఘం జెండా ఆవిష్క‌ర‌ణ‌

మ‌హిళ‌ల హ‌క్కుల కోసం ఉద్య‌మాలు చేయాల‌ని ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు న‌ళిని రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడుపు నళిని రెడ్డి హాజ‌రై మహిళా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశానికి స్వతంత్ర సిద్ధించి 77 సంవ‌త్స‌రాలు అయినప్పటికీ నేటికి మహిళల హక్కుల్ని ఏ ప్రభుత్వాలు కాపాడలేకపోతున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ లాగానే బీజేపీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదే విధంగా కొనసాగించడం చాలా దురదృష్టమ‌న్నారు. మహిళలు రిజర్వేషన్ కోసం చట్టసభల్లో 33 శాతం కావాలని పార్లమెంట్ మెంబర్ అయిన మాజీ గీత ముఖర్జీ అనే ఉద్యమాలతోటి ఈ మహిళా సంఘం ని బలోపేతం చేయడానికి అనేక కృషి చేసింద‌ని అన్నారు. సమానత్వం, సమాజం కోసం మహిళలు పోరాడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళల హక్కుల కోసం మరిన్ని ఉద్యమాలు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, మణిపూర్ లో జరిగిన సంఘటనలకు ప్రపంచమే తలదించుకునే విధంగా ఉంద‌న్నారు. బీజేపీ మాత్రం హిందుత్వం అని పేరు మీద రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్ కృష్ణవేణి, షబానా పుష్ప అరుణ రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *