mudupu Prabhakar:ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాంః సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్

సిరాన్యూస్‌, బేల
ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాంః సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్
బేల మండల కేంద్రంలో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం

కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దామ‌ని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ అన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేప‌ట్టారు.ప్రధాన విధుల గుండా తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలను పంచుతూ సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆత్రం సుగుణ‌క్క‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు.పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదని పదేళ్ళ పాలనలో బీజేపీ ధరలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది అని అన్నారు.రాబోయే రోజుల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ,బిఆర్ఎస్ లను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. ఆత్రం సుగుణక్క కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని పేర్కొన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *