సిరా న్యూస్, ఆదిలాబాద్
కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసిన మహానీయుడు నల్లమల గిరి ప్రసాద్
* సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
* సీపీఐ ఆధ్వర్యంలో నల్లమల గిరి ప్రసాద్ వర్ధంతి
రాష్ట్రంలో ఒక బలమైన సీపీఐ పునాదులు వేసి కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసిన మహానీయుడు మహా నాయకుడు గొప్ప నాయకుడు కామ్రేడ్ గిరిప్రసాద్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ లో గల సీపీఐ కార్యాలయంలో కామ్రేడ్ నల్లమల గిరి ప్రసాద్ 27 వ వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా గిరి ప్రసాద్ చిత్రపటానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ గిరి ప్రసాద్ విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టారు. 1961 లో ఖమ్మం శాసనసభ్యుడిగా 1978 నుండి 91 వరకు సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా 13 సంవత్సరాలు కొనసాగారని తెలిపారు. ఆంధ్ర మహాసభ చైర్మన్గా, 1992 నుండి రాజ్యసభ సభ్యుడిగా సిపిఐ పార్టీలో జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో ఒక బలమైన సీపీఐ పునాదులు వేసి కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసిన మహానీయుడు మహా నాయకుడు గొప్ప నాయకుడు కామ్రేడ్ గిరిప్రసాద్ అని తెలిపారు. గిరిప్రసాద్ ఆశయ సాధన కోసం సిపిఐ జిల్లా సమితి ముందుకు పోవాలని తెలిపారు. వారి ఆశయాలు నెరవేర్చినప్పుడే వారికి విప్లవ ధన్యవాదాలు తెలిపిన వారు అవుతాం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ అరుణ్ కుమార్, సీపీఐ సీనియర్ నాయకులు బెజ్జంకి నర్సింగ్ రావు, అరిగెల గజారాం బి కే యం యు జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి రమేష్, బి కే యం యు జిల్లా అధ్యక్షులు ఖండాల గణేష్ ,సీపీఐ మండల నాయకులు జైనథ్ ఆకుల వెంకన్న, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.