సిరాన్యూస్,ఆదిలాబాద్
సమరయోధులు చండ్ర రాజేశ్వర్ సేవలు మరువలేనివి: ముడుపు ప్రభాకర్ రెడ్డి
సమరయోధులు చండ్ర రాజేశ్వర్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమరయోధులు చండ్ర రాజేశ్వర్ 111 వ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా చండ్ర రాజేశ్వర్ చిత్రపటానికి సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 6,1914 కృష్ణాజిల్లాలో జన్మించిన కామ్రేడ్ రాజేశ్వర్ లండన్ లో బారిష్టర్ చదివి తిరిగి మన స్వదేశానికి వచ్చి కమ్యూనిస్టు పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. వారి సంతాస్తులైన రెండు వేల ఎకరాల భూమిని పంచిపెట్టి ప్రజా ఉద్యమంలో స్వతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. అనేకసార్లు జైలుకుపోయిన సంఘటనలు ఉన్నాయని తెఇపారు. సమా సమాజం స్థాపనగా సోషలిస్టు వ్యవస్థ కోసం నిరంతరం పోరాడుతుండేవారని తెలిపారు. దున్నేవానికి భూమి కావాలని ఆంధ్ర మహాసభలో కాంగ్రెస్ పార్టీ సిఎస్పి సిపిఐ కి నాయకత్వం వహించిన రాజేశ్వరరావతెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముద్గం మొహి నుద్దిన్ తో పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, ఎఫ్ అరుణ్ కుమార్ బి కే ఎం యు జిల్లా అధ్యక్షులు , కార్యదర్శులు అర్ధాంగి రమేష్, ఖండాల గణేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కామ్లే రాందాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ పాషా, బెజ్జంకి నర్సింగరావు, పెద్దింటి మధు, బుచ్చిరాం, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.