సిరా న్యూస్, ఆదిలాబాద్:
సీపీఐ బలోపేతానికి కృషీ చేయాలి
– ముడుపు ప్రభాకర్ రెడ్డి
సీపీఐ బలోపేతానికి పార్టీ శ్రేణులంత సమిష్టిగా కృషీ చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యాదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కామ్రెడ్ లెనిన్ 100వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లెనిన్ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారి వ్యవస్థ నశించి, సమసమాజ స్థాపన జరగాలంటే తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం కావాలన్నారు. దేశంలో అన్నివర్గాల సమానత్వం, కార్మికులు, కర్షకులు, మహిళల హక్కుల కోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, నాయకులు ఎస్ అరుణ్ కుమార్, గెడం పొచ్చిరాం, రాందాస్, వెంకట స్వామి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.