సిరా న్యూస్, ఆదిలాబాద్
దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలి
* సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
* కేంద్ర ప్రభుత్వం ప్లెక్సీ దహనం
దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వా విధానాన్ని నివసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లెక్సీని దహనం చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అర్ధ గంట పాటు గర్ల్స్ స్కూల్ జాతీయ రహదారి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, రైతులకు మార్కెట్ వ్యవస్థ లేకపోవడం గిట్టుబాటు ధరలు రాకపోవటానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని విస్తరించే విధంగా హక్కుల్ని కాలు రాస్తు, దేశ సంపదను పెత్తందార్లకు కట్టబెట్టడానికి కృషి చేస్తున్న బిజెపిని తరిమికొట్టాలన్నారు.ఇకనైనా అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవడానికి రైతులు కార్మికులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అన్ని వర్గాల వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎఫ్ఐ డబ్లూ బెజ్జంకి నర్సింగరావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గెడం పోచ్చిరాం, జిల్లా అధ్యక్షులు ఖండాల గణేష్ , మహబూబ్ ఖాన్ , నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.