Mudupu Prabhakar Reddy: గిట్టుబాటు ధర చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి

సిరాన్యూస్, బోథ్‌
గిట్టుబాటు ధర చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి
* సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర (ఎంఎస్‌పీ) చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతుల ధర్నాకు దిగివచ్చిన మోడీ మూడు నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగిందన్నారు.
ఆ సందర్భంగా మోడీ రైతులకు మద్దతు ధర చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేటికీ ఆ హామీని నెరవేర్చలేని మోడీ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వక్రీకరించడం దురదృష్టకరమని అన్నారు. ఈ దేశానికి రైతులు వెన్నుముక లాంటివారని వారి సమస్యలు పరిష్కరిస్తేనే ఈ దేశం బాగుంటుందని చెప్పారు. స‌మావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, దాస్, రాములు , నరేష్, ప్రేమ్, సుమేర్ పాషా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *