సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో సోమవారం రాత్రి ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో 6 మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు అందులో ముగ్గురు మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారుగా హైదరాబాద్ లో స్థిరపడి డాన్సర్స్ గా వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు హైదరాబాదులో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు. ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినది సింగర్ గా పనిచేస్తుంది తెలుస్తుంది. ఆరుగురు పురుషులు టోలిచౌకి ప్రాంతానికి చెందిన మధ్యతరగతి వ్యక్తులు వీరు వృత్తిపరంగా మటన్ షాపులు నిర్వహింస్తుంటారు వ్యక్తులు గా నిర్ధారించారు పోలీసులు. వీరు ఎలాంటి మాదకద్రవ్యాలు సేవించలేదని కేవలం మద్యం మాత్రమే సేవించారని వారి నుంచి 3 మధ్య సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు…