సిరాన్యూస్, చిగురుమామిడి
మలుపులు… ప్రమాదాలకు పిలుపులు
* సూచిక బోర్డులు కరవు
* ఇబ్బందుల్లో కాలనీవాసులు…పట్టించుకోని అధికారులు
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో రహదారిపై మూలమలుపుల వద్ద కనీస రక్షణ చర్యలు కరువయ్యాయి. నిత్యం అతివేగంగా దూసుకెళ్లే వాహనాలకు ఈ ప్రాంతంలో కళ్లెం పడడం లేదు. హుస్నాబాద్ టు హుజురాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో..నిరంతరం భారీ వాహనాలు వెళ్తుంటాయి.రహదారికి ఇరువైపులా ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీలు ఉన్నారు. చిన్నపిల్లలు రోడ్డుమీదికి ఆడుకుంటూ వస్తున్నారు.అసలే ఇరుకుగా ఉన్న రోడ్డు,అతివేగంగా వాహనాలు వస్తుంటాయి. ప్రమాదాలు జరిగితే ఏలా అని కాలనీవాసులు భయపడుతున్నారు. గతంలో అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు.ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద స్పీడ్ కంట్రోల్ సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.