సిరా న్యూస్, భీమాదేవరపల్లి
విజ్ఞాన మడిలో.. జ్ఞాపకాల జడిలో
* పులకించిన సనాతన వేదిక
* అ’ పూర్వ’ ఆత్మీయ కలయిక
స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ముల్కనూర్ 1994- 1995 పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళన సందర్భంగా సంతోషంగా రోజంతా గడిపారు. అప్పట్లో తమకు పాటలు నేర్పిన ఉపాధ్యాయులను పూలదండలు, శాలువల తో సత్కరించారు. జ్ఞాపికలు అందజేశారు. సరస్వతి మాతకు పూలమాల వేసి సమావేశం ప్రారంభించారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. సరిగ్గా 30 ఏళ్ల తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు.సుమారు 40 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. గడిచిన రోజులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు జీవనోపాధి మార్గాలు అన్ని పంచుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు.ఇక నుంచి టచ్లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. పూర్వ విద్యార్థులు గుండెటి శ్రీకాంత్, గుర్రాల రంజిత్ రెడ్డి ,దొంగల శ్రీనివాస్, అంచూరి శ్యాంసుందర్, ఉడుత శ్రీనివాస్, , మూల రమేష్, అలుగు సంపత్, దార్న హరికృష్ణ, రేణిగుంట్ల రాజు, అప్పని రాజు, రాజేందర్ , కుమాస్వామి, చక్రపాణి,సుహాసిని, స్వరూపా, లీలావతి , షబానా, గౌరీ, తిరుమల, స్వప్న, పద్మ, రాధిక,తదితరులు పాల్గొన్నారు.