సిరాన్యూస్, ఆదిలాబాద్
కళాకారుడు మెట్టు రవిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ప్రముఖ కళాకారుడు మెట్టు రవిని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి అవార్డులు మరిన్ని పొందుతూ జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి తెలంగాణ కళా రత్న అవార్డు కి అదిలాబాద్ నుండి ఎంపిక కావడం అభినందనీయ మన్నారు. జాతీయ స్థాయి కళాకారుడిగా మిట్టు రవి రాణించాలని కోరారు.కళా రంగంలో జానపద ,శాస్ర్తీయ నృత్యంలో సేవలందిస్తూ కళను కళాకారు లను ప్రోత్సహిస్తున్న కళాకారులను తయారు చేస్తూ కళా రంగంలో రాణించడం అభినందనీ యమన్నారు. మీట్టు రవి మరింత ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో పండ్ల శ్రీనివాస్, ధమ్మా పాల్, కొండ గణేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.