సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తాగునీటి సమస్యలు లేకుండా నూతన బోర్లు: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 6వ వార్డులో తాగునీటి సమస్యలు లేకుండా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో నూతన బోరు మోటర్ను ఏర్పాటు చేసినట్లు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ నిధుల నుండి ఖానాపూర్ మున్సిపాలిటీకి నూతనంగా 12 తాగునీటి బోర్లు మంజూరు అయ్యాయని, 12 బోర్లను 12 వార్డులలో వేయిస్తున్నామని, కాలనీలలో ప్రజలకు త్రాగునీటి సమస్య అనేది లేకుండా చూడాలని లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరు వేయించిన బోరు మోటార్లను కాపాడుకునే బాధ్యత కూడా వారిదేనని అన్నారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , స్థానిక కౌన్సిలర్ అమనుల్ల ఖాన్ , కౌన్సిలర్స్ నాయకులు పరిమి సురేష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , కాలనీ వాసులు, మహిళలు నాయకులు తదితరు పాల్గొన్నారు.