Municipal Chairman Rajura Satyam: పిల్లలకు పౌష్టికాహారం అందించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరా న్యూస్‌, ఖానాపూర్
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. శ‌నివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో హాజరు పట్టికను పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్, నాయకులు ,అమానుల్లా ఖాన్ , అంగన్వాడీ టీచర్ విజయ , ప్రాథమిక పాఠశాల టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *