Municipal Chairman Rajura Satyam: ప‌రిస‌రాలను శుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
ప‌రిస‌రాలను శుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* మహాత్మ జ్యోతి బాపులే గర్ల్స్ పాఠశాలలో స్వచ్ఛ ప్రతిజ్ఞ

ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస‌రాలను శుభ్రంగా ఉంచుకోవాల‌ని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జేకేనగర్ కాలనీలోని మహాత్మ జ్యోతి బాపులే గర్ల్స్ పాఠశాలలో సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఆధ్వ‌ర్యంలో స్వచ్ఛత, సేవ, స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.అనంత‌రం ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు బహిరంగ ప్రదేశాలలో మూత్ర, మల విసర్జన చేయకూడదని అవగాహన లేని వారికి మరుగుదొడ్ల పైన అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్, నాయకులు జన్నారపు శంకర్ , షబ్బీర్ పాషా , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మెప్మా సిబ్బంది టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *