Municipal Chairman Rajura Satyam: మంచినీరు బోరు ప‌నులు ప్రారంభం: మున్సిపల్ చైర్మన్ రాజుర స‌త్యం

సిరాన్యూస్‌,ఖానాపూర్
మంచినీరు బోరు ప‌నులు ప్రారంభం: మున్సిపల్ చైర్మన్ రాజుర స‌త్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 10వ వార్డు విద్యానగర్ కాలనీలో తాగునీటి కోసం నూతన బోర్ కావాలని ఆ వార్డు కౌన్సిలర్ కురుమ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.శ‌నివారం తాగునీటి బోరు ప‌నుల‌కు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం భూమి పూజ‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 10వ వార్డులో నూతన బోరును వేయించామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో ఖానాపూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కుర్మా శ్రీనివాస్ , కౌన్సిలర్స్ నాయకులు షబ్బీర్ పాషా , నాయకులు కొత్తపల్లి సురేష్, గణేష్ రమేష్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *