సిరాన్యూస్, సామర్లకోట
సామర్లకోట మున్సిపల్ కమిషనర్గా ఏ శ్రీవిద్య
కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కమిషనర్గా ఏ శ్రీవిద్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఏలూరు జిల్లా భీమవరం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై సామర్లకోట మున్సిపల్ కమిషనర్ గా ఏ శ్రీవిద్య నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్గా శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన కమిషనర్ రామారావు పుష్పగుచ్చలతో స్వాగతం పలికి సిబ్బందిని పరిచయం చేశారు. అనంతరం కమిషనర్ శ్రీవిద్య మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని ఆమె కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది కమిషనర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.