తాడేపల్లిగూడెం లో కొనసాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మె!

సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను తాడేపల్లిగూడెంలో గురువారం కొనసాగించారు.
అన్ని కార్మికసంఘాలు సమ్మెలోకి దిగడంతో అధికారులు పోటీ కూలీలను రంగంలోకి తెచ్చారు.
విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు పనిచేస్తున్న పోటీ కూలీలను కలిసారు. సమ్మెకు దారి తీసిన పరిస్థితులను వివరించి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్మికుల విజ్ఞప్తికి స్పందించిన కొందరు కూలీలు వెనక్కి వెళ్ళిపోయారు.ఈ సందర్భంగా కమిషనర్ డా. ఏ. శామ్యూల్ యూనియన్ నాయకులను చర్చలకు పిలిచారు. పట్టణంలో డెంగ్యూ కేసులు ఉన్నాయని అందువల్ల పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.
అనంతరం సమ్మె శిబిరం వద్ద జరిగిన సమావేశంలో ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని దశలవారీగా ఉద్యమాలు చేసిన తర్వాత ఆఖరు ప్రయత్నంగానే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. సంప్రదింపులలో ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదనిఅందుకే ఆరుసంఘాల జే.ఏ.సి. పిలుపు మేరకు తాము సమ్మె ప్రారంభించామని అన్నారు.సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
మునిసిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరారు. యూనియన్ కార్యనిర్వహక అధ్యక్షురాలు మండేల్లి జయసుధ మాట్లాడుతూ ఉద్యోగులనే పేరుతో తమకు నవరత్నాలు పథకాలు అమలు చేయలేదని, అయితే ఉద్యోగులుగా గుర్తించి పీఆర్సీ ఇవ్వడం లేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు.
ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబూరావు సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సమ్మెను కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.
కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కే.చంద్రరావు, కోశాధికారి కే. కాటమరాజు, సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్ , నాయకులు యు.నాగరాజు, మండేల్లి రామకృష్ణ, రౌతు రాజేష్, ధనాల రవి, కళింగ శ్రీను, బి.శివశంకర్, బొబ్బిలి రామాంజనేయులు , లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, బైపే సుబ్బారావు, కళింగపట్నం శ్రీనివాస్ , ప్రవీణ్, చేపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి,కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *