సిరా న్యూస్,రాచకొండ;
రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర హత్య జరిగింది. నందనవనం కి చెందిన సాల్మన్ అనే వ్యక్తి ని నందనవనం సూరి అతని అనుచరులు కత్తులతో దాడి చేసి చంపారు. గతంలో నందనవనం సూరి సాల్మన్ చెల్లి నీ ప్రేమ వివాహం చేసుకున్నాడు సంవత్సరం కిందట ఆమెని బిల్డింగ్ పైనుంచి తోసివేసి హత్య చేశాడు.
సల్మాన్ కూడా పాత నేరస్తుడే చర్లపల్లి జైల్లో ఏడు సంవత్సరాల శిక్షను అనుభవించి బయటికి వచ్చాడు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. సూరి తో పాటు మరో నలుగురు ఉన్నారని సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.