సిరా న్యూస్,విజయవాడ;
నడిరోడ్డుపై నరికి నరికి ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. కన్న కుమార్తె ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ (56) బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువు తోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటు న్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా దార్శిని అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చ రించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
============