సిరా న్యూస్,తాడేపల్లి;
బ్రహ్మనందపురం ఫారెస్ట్ లో మృతదేహం కలకలం రేపింది. ఎయిమ్స్ రోడ్డులోని ఫారెస్ట్ లో చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు నార్త్ ఇండియాకు చెందిన వ్యక్తిలా ఉన్నాడని యువకుడిని హత్య చేసి చెట్టుకి ఉరివేసి ఉండొచ్చని భావిస్తున్నారు.