సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరులో ఘరానా మోసం గుట్టు రట్టు అయింది డాక్టర్ ముసుగులో స్నేహితులుగా నమ్మించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్న డాక్టర్ను అరెస్టు చేశారు. పిలిప్పీయన్స్ లో ఎంబిబిఎస్ కోర్స్ చేస్తున్నప్పటినుంచి ఆన్లైన్ బెట్టింగ్స్ , వ్యసనాలకు బానిసగా మారిన కొవ్వూరు భాను సుందర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పులు ఎగగొట్టాడనికి అప్పు ఇచ్చిన వారికీ మార్ఫిన్ అనే మత్తు ఇంజక్షన్ ద్వారా ఇచ్చి వ్యక్తులను హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. భాను సుందర్ ని 1టౌన్ సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసారు. స్థానిక ఏలూరు లోని శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగర్లో టుబాకో గోడౌన్ దగ్గర నివాసం ఉంటున్న హిమతేజ వద్ద తీసుకున్న అప్పు ఎగగొట్టాడానికి మార్ఫిన్ అనే మత్తు ఇంజక్షన్ చెయ్యటం వల్ల అనారోగ్య పాలయ్యాడు చోదిమెళ్ళకి చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తికి కూడా ఇలాగే ఇంజక్షన్ చెయ్యడం వలన కోలుకోలేక అనారోగ్యంతో మల్లేశ్వరావు చనిపోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన 1టౌన్ సీఐ రాజశేఖర్, మినీ బైపాస్ లోని పడమర లాకుల వద్ద నిందితుడుని పట్టుకుని రిమాండ్ కి తరలించారు…