సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి

ఏసిపి ఎం. వెంకటరమణ

సిరా న్యూస్,కమాన్ పూర్( గోదావరిఖని );

ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగరుకత దివాస్ ను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) ఆదేశాల ప్రకారం బుధవారం సైబర్ క్రైమ్ డిసిపి వెంకటరమణ మరియు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆర్జీ వన్ పరిధిలోని ఒసిపి 5 మైన్ వద్ద ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై సింగరేణి కార్మికులకు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏసీపి రమణ మాట్లాడుతూ…. సాదారణగా ప్రజలు అత్యాశ, అమాయకత్వం వలన సైబర్ నేరాలకు గురి అవుతున్నారని అనారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు.మహిళలను ఎరచూపి వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారని ఇలాంటి వాటిపై వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. ఈ మధ్యకాలంలో పిల్లలు, యువత ఆన్లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకొని ఆ డబ్బులతో రమ్మీ గేమ్, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారని మీ పిల్లలు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలని, వారి ప్రవర్తన మరియు మొబైల్ ఉపయోగం పై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరో తెలియని నేరస్థుడు సాంకేతికతను, ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్ల రూపంలో దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి.ఎస్.పి. వెంకటరమణ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, కానిస్టేబుల్ కుమార్, శ్రారీనివాస్, డిజి ఎం రామస్వామి మేనేజర్ అనిల్, సేఫ్టీ అధికారి పొనుగోటి శ్రీనివాస్ సింగరేణి కార్మికులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *