Must Utilize Prajapalana: ప్రజాపాలనలో ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి…

సిరా న్యూస్, తలమడుగు:

ప్రజాపాలనలో ప్రతీ ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి…
– జడ్పిటీసీ గోక గణేష్‌ రెడ్డి

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబం తప్పక దరఖాస్తు చేసుకోవాలని జడ్పిటీసీ గోక గణేష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా తలమడగు మండల కేంద్రంతో పాటు మండలంలోని సుంకిడి గ్రామంలో ప్రాజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి, దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జడ్పిటీసీ మాట్లాడుతూ.. రేషన్‌ కార్డు లేని వారు సైతం 5 గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి మహావీర్, ఎంపిడీవో రమాకంత్, తహాసీల్దార్‌ రాజ్‌మోహన్, ఎంపీవో దిలీప్‌ కుమార్, ఎంఈవో నారాయణ, సర్పంచ్‌లు గెల్ల మహేందర్‌ యాదవ్, కళ్లెం కరుణాకర్‌ రెడ్డి, కాంగ్రేస్‌ పార్టి మండల కన్వీనర్‌ కళ్యాణం రాజేశ్వర్, నాయకులు వెంకన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *