సిరాన్యూస్, శంకరపట్నం:
ముత్తారంలో ఘనంగా రేణుకాదేవి బోనాల జాతర
* ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో బుధవారం గౌడ కులస్తులు శ్రీ రేణుకాదేవి, జమదగ్ని కళ్యాణ మహోత్సవం, శ్రీ రేణుకాదేవి బోనాల జాతర పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల గుండా డప్పు చప్పుళ్ళ మధ్య, దామెర అశోక్ స్వామి, ఆయన శిష్యుల బృందం శివ సత్తులు పూనకాలు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి దైవసన్నిధికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని పిల్లాపాప, గొడ్డుగోదా, పాడిపంటలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వర్షాలు విస్తారంగా కురిసి రైతన్నలు ఆనందంగా ఉండాలని కోరుతూ చల్లంగా దీవించమ్మ అంటూ శ్రీ రేణుకాదేవి తల్లిని వేడుకుంటూ బోణాంకుండలు నెత్తిన ఎత్తుకుని శ్రీ రేణుకాదేవి గుడి వద్దకు భక్తులు భక్తి శ్రద్ధలతో బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బోంగోని రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు సుద్దాల రఘు గౌడ్, డైరెక్టర్లు గట్టు రాజేష్ కుమార్ గౌడ్, బోంగోని రాజేంద్ర ప్రసాద్ గౌడ్, పంజాల లక్ష్మణ్ గౌడ్, కొమిరె తిరుపతి గౌడ్, మార్క చందు గౌడ్, సుద్దాల ప్రభాకర్ గౌడ్, అరె అనిల్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ సీనియర్ నాయకులు, మహిళలు, యువతీ యువకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.