దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను రాష్ట్ర మంత్రిగా…

-సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీధర్ బాబు

-1999లో తొలిసారిగా, 2023లో 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక

-మంథని నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లిన అభిమానులు కార్యకర్తలు

సిరా న్యూస్,మంథని;

దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని గురువారం ఆయన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శ్రీధర్ బాబు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేశారు.
మంథని నియోజకవర్గం నుండి 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను గురువారం రాష్ట్ర మంత్రిగా గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రిగా శ్రీధర్ బాబు కు అవకాశం దక్కింది. శ్రీధర్ బాబుతోపాటు మరో పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.2009లో అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు రాజశేఖర్రెడ్డి మరణించిన తరువాత రోశయ్య మంత్రివర్గంలో, కిరన్ కుమార్రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకరాం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంథని నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలోకాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్థానం: 1969లో కాటారం మండలం ధన్వాడలో జననం తల్లిదండ్రులు : దుద్దిళ్ల శ్రీపాదరావు, జయమ్మ, భార్యపిల్లలు : శైలజా రామయ్యార్ (సీనియర్ ఐఏఎస్) ఇద్దరు పిల్లలు
చదువు : న్యాయవాద విద్యలో ఉత్తీర్ణత ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాది రాజకీయ అరంగేట్రం : తండి దివంగత స్పీకర్ శ్రీపాదరావు హత్య అనంతరం రాజకీయ ప్రవేశం
ఎమ్మెల్యేగా : 1999 తొలిసారిగా మంథని ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. వరుసగా 2004, 2009, 2018, 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పదవులు : 2004-06లో తిరుమల తిరుపతి దేవ దేవస్థానం బోర్డు సభ్యుడు, 2004-08 వరకు ప్రభుత్వ విప్, 2009-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, 2014లో తెలంగాణ ఉద్యమ సమయంలో మంథనిలో ఓటమి, 2018లో తిరిగి మంథని ఎమ్మెల్యేగా విజయం, 2023లో 5వ సారి మంథని ఎమ్మెల్యేగా ఎన్నిక మళ్లీ మంత్రి పదవి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిపిసిసి మ్యానిఫెస్టో కమిటి చైర్మన్ గా శ్రీధర్ బాబు వ్యవహరించారు. శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *