మైలార్ దేవ్ పల్లి లో దోపిడీ దొంగల బీభత్సం

సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్య
సిరా న్యూస్,రంగారెడ్డి;
ఆరంఘర్ చౌరస్తా లో ఓ పరిశ్రమలో దొంగతనం చెయ్యడానికి వచ్చిన దొంగలు సెక్యూరిటీ గార్డు పై దాడి చేసారు. విచక్షణారహితంగా కొట్టడ్డంతో స్పాట్ లో నే వాచ్ మెన్ ఆసిఫ్ చనిపోయాడు. దొంగలు ఆరు సిసి కెమెరాలు, విలువైన ఐరన్ రాడ్స్ దొంగలించారు. ఉదయాన్నే సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురి కావడం గమనించిన యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *